Team India: ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరిన భారత జట్టు.. ప్రత్యేక విమానంలో రానున్న 70మంది

Team India: అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ సాధించిన భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరింది.

Update: 2024-07-03 15:00 GMT

Team India: ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరిన భారత జట్టు.. ప్రత్యేక విమానంలో రానున్న 70మంది

Team India: అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ సాధించిన భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరింది. భారీవర్షాల కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్ అనంతరం క్రికెట్ టీం బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. తుపాన్ తీవ్రత తగ్గడంతో టీంను భారత్ రప్పించేందుకు BCCI ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా... రోహిత్ సేన భారత్‌కి పయనమైంది.

BCCI కార్యదర్శి జైషా సహా టీమిండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, మీడియా కవరేజ్‌కి వెళ్లిన రిపోర్టర్లు అంతా కలిపి 70 మంది అక్కడి నుంచి బయలుదేరారు. వీరంతా గురువారం ఉదయానికి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు 11 గంటలకు ప్రధాని మోడీ టీం ఇండియా జట్టుతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News