Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌ దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్

Jammu And Kashmir: భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల మృతి

Update: 2024-08-14 10:15 GMT

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌ దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్ 

Jammu And Kashmir: జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కెప్టెన్ దీపక్‌ సింగ్ అమరుడయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం వేళ దాడుల కోసం ఉగ్రవాదులు ఉదమ్‌పూర్‌లో ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవేట కొనసాగిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ మరణించారు. మరోవైపు ఎన్‌కౌంటర్ పరిసర ప్రాంతాల్లో దొరికిన వస్తువుల ఆధారంగా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News