పూజ హెగ్డే కారణంగా ఎదురుచూడనున్న మహేష్ బాబు మరియు త్రివిక్రమ్..?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడవ సినిమా త్వరలోనే పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే.

Update: 2022-11-10 15:30 GMT

పూజ హెగ్డే కారణంగా ఎదురుచూడనున్న మహేష్ బాబు మరియు త్రివిక్రమ్..?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడవ సినిమా త్వరలోనే పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ కాంబో లో రాబోతున్న మూడవ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ సినిమా షూటింగ్ ఎట్టాకేలకు నవంబర్ ఆఖరి వారంలో పట్టాలెక్కనుంది.

ప్రస్తుతం ఫారిన్ వెకేషన్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు హైదరాబాద్ కి తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్లో సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న పూజ హెగ్డే మాత్రం ఈ షెడ్యూల్లో పాల్గొనే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి. దానికి కారణం పూజా హెగ్డే ఆరోగ్య పరిస్థితి అని సమాచారం.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన "కిసీ కా భాయ్.. కిసీకీ జాన్" సినిమా షూటింగ్ సమయంలో పూజా హెగ్డే కాలు బెణికింది. అయినప్పటికీ నొప్పిని భరిస్తూనే సినిమా షూటింగ్ లో పాల్గొంది పూజ హెగ్డే. దీంతో ఆమె కాలి పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా మారింది. ప్రస్తుతం వైద్యులు పూజా హెగ్డే ని కొన్ని రోజులపాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే కి షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. ఇక కోలుకున్న వెంటనే పూజ హెగ్డే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News