Mahesh Babu: మహేష్‌-రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్‌..!

ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటి వరకు టైటిల్‌ కానీ, షూటింగ్ అప్‌డేట్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Update: 2024-09-15 14:45 GMT

Mahesh Babu: మహేష్‌-రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్‌.. 

ట్రిపులార్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం ఇండియన్‌ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ సినిమాపై అంచనాలు అప్పుడే ఆకాశాన్నంటేలా ఉన్నాయి.

ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటి వరకు టైటిల్‌ కానీ, షూటింగ్ అప్‌డేట్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గతంలో ఈ సినిమా టైటిల్ గరుడ అంటూ ఓ వార్త వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చిత్ర యూనిట్ స్పందించలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా అమెజాన్‌ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. దీనిపై కూడా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వార్తల ప్రకారం. ఈ సినిమా కథ 18వ శతాబ్ధం నేపథ్యంలో సాగుతుందని సదరు వార్తల సారంశం. ఆ కాలానికి తగ్గట్లుగానే హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 200 మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకుంటున్నారని సమాచారం.

ఓ గిరిజన తెగకు చెందిన గ్రామాన్ని సృష్టించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం జూనియర్‌ ఆర్టిస్టుల ఎంపికతో పాటు ఇతర నటీనటులను చిత్ర యూనిట్‌ ఎంపిక చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకి ప్రధాన తారాగణంతో వర్క్‌ షాప్స్‌ మొదలుపెట్టి డిసెంబర్‌లో షూటింగ్‌ ఆరంభించాలని అనుకుంటున్నారని సమాచారం.

మరి ఈ అన్ని వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News