Israel: ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడి..చిన్నారులతో సహా 11 మంది మృతి

Israel: ఇజ్రాయెల్‌పై శనివారం రాకెట్లతో దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 11 మంది చనిపోయారు. మరణించిన వారిలో చాలా మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.

Update: 2024-07-28 04:31 GMT

Israel:ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడి..చిన్నారులతో సహా 11 మంది మృతి

Israel:ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్‌పై శనివారం రాకెట్ అకస్మాత్తుగా దాడి చేసింది. పిల్లలందరూ.. ఫుట్‌బాల్ ఆడుతుండగా రాకెట్ దాడి జరిగింది. ఈ రాకెట్ దాడిలో చాలా మంది చిన్నారులతో సహా 11 మంది మరణించారు. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా గ్రూపులోని ముగ్గురు సభ్యులు మరణించిన కొన్ని గంటల తర్వాత ఈ రాకెట్ దాడి జరిగింది. దీని వెనక లెబనాన్ కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్ బొల్లా హస్తం ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇదొక తీవ్రమైన ఘటనగా పేర్కొంది. తదానుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఈ దాడికి తాము కారణమని ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను హెచ్ బొల్లా ఖడించింది. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని పేర్కొంది.

ఈ చిన్నారులపై హెచ్ బొల్లా రాకెట్ ను ప్రయోగించిందని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రధాన ప్రతినిధి డేనియల్ హగారి ఆరోపణలు చేశారు. ఈ విషయంలో హెజ్ బొల్లా అబద్దం చెబుతోందన్నారు. గాజాలో యుద్ధానికి దారితీసిన అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిని అని డేనియల్ పేర్కొన్నారు. కాగా హిజ్బుల్లా ఈ దాడికి ఇంతవరకు చెల్లించని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.



Tags:    

Similar News