విజయవాడలో దుండగుల నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన ఫైనాన్స్ వ్యాపారి గగారిన్ మృతి చెందారు. మూడు రోజుల క్రితం ఆయనపై మాదాల సురేష్, మాదాల సుధాకర్ అనే వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన గగారిన్ మృత్యువుతో పోరాడి తనువు చాలించారు. ఈ కేసులో నిందితుల కోసం 4 బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే, మొఘల్ రాజుపురం శిఖామణి సెంటర్లో ఓ భవనం విషయంలో వివాదమే గగారిన్పై హత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది.