పార్లమెంటు ఆవరణలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు నిరాహారదీక్ష

Update: 2018-12-18 06:59 GMT

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర వైఖరికి నిరసనగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పార్లమెంటు ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టాలని ఎంపీ నిర్ణయించారు. దీంతో ఇవాళ ఉదయం గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. పార్లమెంటు ముగిసే వరకు ఆయన దీక్ష కొనసాగనుంది. రామ్మోహన్ నాయుడు నిరసనకు మద్దతుగా టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వంగపండు వేషధారలో జానపద పాటలు పాడుతూ ఎంపీ శివప్రసాద్‌ మోదీపై విమర్శలు గుప్పించారు.

Similar News