జగన్‌ సీఎం కావాలని యువకుడి పాదయాత్ర

Update: 2018-12-20 13:52 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాగైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయంతో తూర్పుగోదావరి జిల్లా యేవకుడు సతీష్  హైదరాబాద్ నగరం నుండి విజయవాడ కనక దుర్గమ్మ గుడికి కాలినడకతో బయలుదేరాడు. జగన్ మోహన్ రెడ్డి ఇళ్లు లోటస్‌పాండ్‌ నుంచి మంగళవారం పాదయాత్రగా బయలుదేరి నార్కెట్‌ పల్లికి చేరుకున్నారు. ఈసందర్భంగా సతీష్ మాట్లాడుతూ వైసీపీ మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సమయంలో ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు ఎన్నో రకాలుగా మేలుజరిగిందని సతీష్ అన్నారు. అలాగే జగన్‌ మోహన్ రెడ్డి ముఖ్యమంతైయితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, పేదలకు పెన్షన్లు, ఇళ్లు వస్తాయని, అభివృద్ధి పనులు జరుగుతాయని సతీష్ తెలిపారు. సతీష్ ప్రస్తుతం కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్నాడు.

Similar News