మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

Update: 2018-11-24 06:20 GMT

సింహాచలం ఆర్టీసీ డిపో దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిపో మేనేజర్‌ వేధింపులు భరించలేక డ్రైవర్‌ సీహెచ్ నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్టాఫ్‌ అండ్‌ వర్కింగ్‌ యూనియన్లు ఆందోళన చేపట్టారు. రెండు రోజుల క్రితం డ్రైవర్‌ నాగేశ్వరరావుపై ఓ ప్రయాణీకుడు డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే డిపో మేనేజర్‌ మాత్రం ఎలాంటి విచారణ చేపట్టకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. దీనిపై తీవ్ర మనోవేధన అనుభవించిన నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు డిపో మేనేజర్‌ వేధింపులే కారణమంటూ చేతిపై రాసుకుని మరీ ప్రాణాలు తీసుకున్నాడు. డిపో మేనేజర్‌తో పాటు సదరు ప్రయాణీకుడిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ వర్కర్లు, ఎంప్లాయీస్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 
 

Similar News