ఆఫీసులోనే ఆలయ ఈవో ఆత్మహత్య...

Update: 2018-12-15 09:08 GMT

విశాఖ పాండురంగస్వామి ఆలయ ఈవో కోపిశెట్టి నాగేశ్వరరావు ఆఫీసులోనే ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై నాగేశ్వరరావును గత రెండురోజుల క్రితం సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News