తీవ్ర వాయుగుండంగా పెథాయ్ తుఫాన్ మరిందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీహరికోటకు 720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 17న రాత్రి తూర్పుగోదావరి- విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పెథాయ్ తుఫాన్ కదులుతుందని తెలిపింది. పెథాయ్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో నెల్లూరులోని లోతట్టు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు 2015లో సంభవించిన తుపానులో ముంపుకు గురైన మున్సూద్ నగర్, కొట్టమిట్ల, శివగిరి కాలనీ, యనమల కాలువ, ప్రాంతాలను పరిశీలించారు నెల్లూరు నగరంలో ప్రవహించే కలుజు కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను వెంటనే తొలగించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.