రికార్డ్ స్థాయిలో పోలవరం నిర్మాణం జరుగుతోందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. చంద్రబాబు ముందుచూపు, రాజకీయ అనుభవం వల్లే రాష్ట్రంలో పచ్చదనం ఏర్పడిందన్నారు. రాయలసీమకు 266 టీఎంసీలు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. పులివెందులకు సాగునీరు ఇవ్వడం వైఎస్కు చేతకాలేదని విమర్శించారు. హంద్రీనీవా ద్వారా చిత్తూరు జిల్లాకు సాగునీరు తీసుకొస్తున్నామని మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు.