2014లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తెలుగమ్మాయి అనూహ్య అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ ముంబై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేసేది. లిప్ట్ పేరుతో ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన చంద్రభాను సనన్ ఆమెపై హత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. అప్పట్లో అనూహ్య హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, మూడున్నరేళ్ల తర్వాత, ఇప్పుడు నిందితుడు సనన్ ను.. దోష్టిగా తేల్చడంతో పాటు ఉరిశిక్షను విధించింది.