చిత్తూరు జిల్లాలో సిలికాన్ సిటీ ఏర్పాటు చేయనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్లో సైబరాబాద్ను సృష్టించినట్లుగానే ఏపీలో సిలికాన్ సిటీని నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎన్నో కంపెనీలు జిల్లాకు తరలిరానున్నాయని, తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్గా మారనుందని చెప్పారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాలలో చైనా జైంట్ టీసీఎల్ కంపెనీకి సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. టీవీ ప్యానళ్ల తయారీలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కంపెనీగా గుర్తింపు పొందిన టీసీఎల్ ఏడాదికి 60 లక్షల టీవీల తయారీ లక్ష్యంతో ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. డిసెంబరు నాటికి టీసీఎల్ కంపెనీ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయని చంద్రబాబు చెప్పారు.