విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

Update: 2018-02-24 10:32 GMT

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. భాగస్వామ్య సదస్సుకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 40 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో 11 అంశాలపై ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఇప్పటికే 400 అవగాహన ఒప్పందాలకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నెల 26న భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమం జరగనుంది. ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సురేష్‌ ప్రభు, పలువురు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News