మాణిక్యాల గన్‌మెన్ల సరెండర్...రాజీనామా లేఖపై దుమారం

Update: 2018-12-25 12:31 GMT

తనకు కేటాయించిన భద్రతా సిబ్బందిని తాడేపల్లిగూడెం బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాలరావు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తన రాజీనామా లేఖను ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుకు పంపించారు. 15రోజుల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిరవధిక దీక్షకు దిగుతాన్నారు. మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు రాజీనామా ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లి గూడెం నియోజకవర్గ సమస్యలు పరిష్కారానికి సీఎం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. 15 రోజుల్లో చంద్రబాబు స్పందించకపోతే నిరవధిక దీక్షకు దిగుతానన్నారు మాణిక్యాలరావు.
 

Similar News