అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు పై కేంద్రం క్లారిటీ

Update: 2018-12-20 06:48 GMT

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనా చౌదని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగారాం ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఆర్టికల్ 170లో 3వ నిబంధన ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు ఉంటుందని గంగారాం స్పష్టం చేశారు. మంత్రి ప్రకటన ప్రకారం మ‌రో దశాబ్దం వ‌ర‌కూ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు అవకాశం లేన‌ట్లుగానే నేతలు భావిస్తున్నారు. 

Similar News