టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం హాట్ హాట్ గా నడిచింది. సభ్యత్వ నమోదు మందకొడిగా సాగుతుందని తెలుగు తమ్ముళ్లకు క్లాస్ తీసుకున్నారు. గట్టిగా తిడితే ప్రజల్లో చులకన అవుతామని ఊరుకుంటున్నానని పరిస్థితులు అర్థం చేసుకోవాలన్నారు. పనులు చేసి మెప్పు పొందాలి తప్ప పార్టీని మోసం చేస్తూ కాదన్న ఆయన ఎన్నికలయ్యే వరకు సీరియస్ గానే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలను నేతలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. నేతలు చేసే తప్పులతో పార్టీ పరువుపోతుందని మండిపడ్డారు.