Stock Market: సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీ

Stock Market: ఉదయం లాభాల్లో, సాయంత్రానికి నష్టాలతో ముగింపు

Update: 2024-05-27 16:07 GMT

Stock Market: సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్‌.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 75 వేల 655 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై... 76 వేల 9 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 19.89 పాయింట్ల నష్టంతో 75 వేల 390 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.65 పాయింట్లు కోల్పోయి 22 వేల 932 వద్ద స్థిరపడింది.

Tags:    

Similar News