దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై..

Update: 2021-02-04 08:35 GMT

Representational Image

దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై కి చేరి సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి వారం రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా కొనసాగినప్పటికీ, గురువారం రోజు పెట్రోలియం కంపెనీల సమీక్ష ఫలితంగా ధరలు భగ్గుమంటున్నాయి రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 35 పైసలు మేర పెరిగి 86 రూపాయల 65 పైసలు, డీజిల్ 35 పైసలు చొప్పున పెరిగి 76 రూపాయల 83 పైసలు వద్దకు చేరాయి ఆర్దిక రాజధఆని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయల ఎగువకు చేరింది ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయల 10 పైసలు డీజిల్ ధర లీటర్‌ కు 35 పైసలు చొప్పున పెరిగి 83 రూపాయల 81 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Full View


Tags:    

Similar News