Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: 36.22 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్

Update: 2024-07-08 14:54 GMT

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. ఇంట్రాడేలో కాస్త కోలుకున్నాయి. HDFC బ్యాంక్‌, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోగా... ITC, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇటీవల ఈక్విటీలు గరిష్ఠాలకు చేరిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతుండడమే దీనికి కారణం. సెన్సెక్స్‌ 36.22 పాయింట్ల నష్టంతో 79 వేల 960.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 3.30 పాయింట్ల నష్టంతో 24 వేల 320.55 వద్ద స్థిరపడింది.

Tags:    

Similar News