మరో సీటు కన్ఫామ్ చేసిన వైసీపీ.. రాజీనామా యోచనలో కీలకనేత

Update: 2019-02-28 02:38 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్ మరింత దూకుడు పెంచారు. ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే ఉన్నదున టిక్కెట్లు ఫైనల్ చేసే పనిలో పడ్డారు జగన్.. ఇప్పటికే 80 శాతం ఎమ్మెల్యే సీట్లు కన్ఫర్మ్ చేసిన జగన్ తాజాగా మరో కీలక నియోజకవర్గానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఆమంచి కృష్ణమోహన్ ఎంపిక చేశారు. నిన్న(బుధవారం) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీలో చేరిన ఆమంచికి.. చీరాల సీటు కన్ఫామ్ చేయడంతోపాటుగా.. ప్రచారం ప్రారంభించాలని సూచించారు. కాగా టికెట్ హామీ వచ్చిన రావడంతో జగన్, విజయమ్మ, షర్మిలను చీరాల ప్రచారానికి రావలసిందిగా ఆమంచి ఆహ్వానించారు. కాగా ఆమంచికి టిక్కెట్ కేటాయించడంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన యడం బాలాజీ వైసీపీని వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ చర్చలు జరుపుతున్నారు.  

Similar News