అందుకే రాజీనామా చేశా : వంగవీటి రాధా

Update: 2019-01-20 14:39 GMT

వైసీపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న రాధా.. పార్టీలో తనకు పూర్తిగా స్వేచ్ఛ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. అయితే ఏ పార్టీలో చేరాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. వంగవీటి అభిమానులు, కార్యకర్తలతో చర్చించాక.. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను అని స్పష్టం చేశారు. ఇక రాధాతో జనసేన, టీడీపీ నేతలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తోంది టీడీపీ. మరోవైపు జనసేన నేతలు తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్.. వంగవీటి రాధాతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 

Similar News