అయ్యో పాపం.. హెయిర్ కలర్ కలిపిన నీటిని తాగి ఇద్దరు చిన్నారులు మృతి

Kurnool: ఆడుకుంటూ వెళ్లి నీటిని తాగారంటూ తెలిపిన తల్లి శారద

Update: 2023-12-31 06:05 GMT

అయ్యో పాపం.. హెయిర్ కలర్ కలిపిన నీటిని తాగి ఇద్దరు చిన్నారులు మృతి

Kurnool: కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్విలో దారుణం జరిగింది. హెయిర్ కలర్ కలిపిన నీటిని తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పిల్లలు ఇంటి బయట ఆడుకుంటూ ఆ నీటిని తాగారని.. తాను ఇంటి పనులు చేసుకుంటున్నాని తల్లి శారద ఆరోపించింది. తన గురించి కుటుంబసభ్యులు ఏమైనా అనుకుంటారనే భయంతో.. అనంతరం తాను కూడా హెయిర్ కలర్ తాగినట్లు శారద తెలిపింది. చిన్నారులు వెంకటేష్, భరత్‌ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News