నేడు జగన్‌ను కలవనున్న అలీ

Update: 2019-01-05 02:51 GMT

 సినీ హాస్యనటుడు అలీ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైంది. ఆయన ఈనెల 9న వైసీపీలో చేరబోతున్నారు. ఈ క్రమంలో శనివారం వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్‌ను అలీ కలవనున్నారు. ముందుగా మాజీ ఎంపీ, జగన్ రాజకీయ కార్యదరి వైవీ సుబ్బారెడ్డిని పశ్చిమగోదావరిలో కలిసి ఆయనతోపాటు అక్కడి నుంచి జగన్‌ వద్దకు వెళతారని సమాచారం. గత వారం శంషాబాద్ విమానాశ్రయంలో జగన్ తో భేటీ అయిన అలీ పార్టీలో చేరిక విషయంపై చర్చించారు.

ఆయన గుంటూరు ఈస్ట్ లేదా రాజమండ్రి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. అయితే గుంటూరు ఈస్ట్ నుంచి వైసీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఆయనను కాదని అలికి టికెట్ ఇస్తారా అన్న చర్చ మొదలయింది. మరోవైపు రాజమండ్రి టికెట్ ను మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాష్ రిజర్వ్ చేసుకున్నారు. ఈ ఇద్దర్ని కాదని జగన్ అలీ వైపు మొగ్గు చూపుతారా.. లేక ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 

Similar News