Pawan Kalyan: చారిత్రక విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు
Pawan Kalyan: 5కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను అసెంబ్లీలో వినిపించాలి
Pawan Kalyan: జనసేనకు చారిత్రక విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు జనసేనాని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను అసెంబ్లీలోకి తీసుకెళ్లాలని జనసేన ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జనసేన కార్యాలయంలో పవన్ భేటీ అయ్యారు. విలువలతో కూడిన రాజకీయం చేద్ధామని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగ్వస్వామ్యం కాబోతున్నామన్నారు. జనసేన కార్యాలయం 24గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతాం అన్నారు పవన్. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్..తొలుత ఈ ఆరు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు భరోసా కల్చించాలన్నారు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాన్.