గుడివాడ గూట్లే నాని.. కృష్ణా జిల్లా... పరువు తీస్తున్నాడని మండిపడ్డ దేవినేని ఉమ

*కొడాలి నానిపై తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు

Update: 2022-09-10 14:15 GMT

కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫైర్

Andhra Pradesh: చంద్రబాబు, లోకేష్‌లపై కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దేవినేని ఉమ, గద్దె రాంమోహన్, బుద్ధ వెంకన్న, వర్ల రామయ్య, విజయవాడ పార్లమెంట్ ఇంచార్జి నేటం రఘురాం తదితరులు పోలీసులకు ఫిర్యాదు పత్రం అందజేశారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని ఈ సందర్భంగా దేవినేని ఉమ అన్నారు. గుడివాడ గూట్లే నాని... కృష్ణా జిల్లా పరువు తీస్తున్నాడని ఫైర్ అయ్యారు. 

Tags:    

Similar News