Pemmasani Chandrasekhar: రైల్వే అధికారులతో గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష

Pemmasani Chandrasekhar: కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారిగా గుంటూరు వచ్చారు.

Update: 2024-06-22 14:00 GMT

Pemmasani Chandrasekhar: రైల్వే అధికారులతో గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష

Pemmasani Chandrasekhar: కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారిగా గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా గుంటూరులో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్ నిర్మాణాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో ఇక్కడి రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పెమ్మసాని అన్నారు. గుంటూరు జిల్లాలో రైల్వే బ్రిడ్జిల పరిస్థితిపై అధికారులతో చర్చించినట్టు తెలిపారు.

Tags:    

Similar News