Tirumala: దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి నోటీసులు జారీ

Tirumala: ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Update: 2024-10-20 05:44 GMT

Tirumala: దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి నోటీసులు జారీ

Tirumala: ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41A కింద నోటీసులు ఇచ్చారు. పవిత్రమైన తిరు మాడ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురిపై ఇప్పటికే టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్, మాధురి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. 

కొద్దిరోజుల క్రితం దివ్వెల మాధురితో పాటు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అనంతరం వీరిద్దరు కలిసి మాడవీధుల్లో హల్ చల్ చేశారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించారు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని.. కోర్టుల్లో కేసులు కొలిక్కివచ్చాక పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అయితే తిరుమలలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. దివ్వల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణలో భాగంగా నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News