ఇవాళ సరెండర్ కానున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
Tadipatri: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు.
Tadipatri: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణల కేసులో ఆయన ఇవాళ జిల్లా ఎస్పీ ముందు సరండర్ అవనున్నారు. ఇప్పటికే ఈ కేసుల్లో 9 మంది వైసీపీ నేతలు నిన్న లొంగిపోయారు. ఇవాళ కేతిరెడ్డితో పాటు మరో 38 మంది వైసీపీ నేతలు సరండర్ అవనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ కోర్టుకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.