AP News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభాపక్ష భేటీ... హాజరైన డిప్యూటీ సీఎం పవన్

AP News: వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ

Update: 2024-07-22 09:05 GMT

AP News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభాపక్ష భేటీ... హాజరైన డిప్యూటీ సీఎం పవన్

AP News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. గడిచిన ఐదేళ్లు వైసీపీ పెట్టిన ఇబ్బందులని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యేలు. చట్టం ప్రకారం ముందుకు వెళ్దామని, చట్టం తన పని తాను చేస్తుందంటూ చెప్పారు. సాండ్ పాలసీలో ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ సూచించారు. కలిసికట్టుగా అందరూ కలిసి పనిచేయాలంటూ దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సూచించారు. నియోజకవర్గంలో వేసే కమిటీల్లో అన్ని పార్టీలను కలుపుకోవాలని నాదెండ్ల మనోహర్ కోరారు. కావాలనే.. వైసీపీ బురద చల్లె ప్రయత్నం చేస్తుందని.. కక్షపూరిత చర్యలు వద్దన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నారు.

Tags:    

Similar News