Chandrababu Naidu: గురుపౌర్ణమి మహోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: శ్రీ రామదూత అవధూత స్వామి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు

Update: 2024-07-21 10:08 GMT

Chandrababu Naidu: గురుపౌర్ణమి మహోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌ సెంటర్‌లో గురుపౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సీఎం చంద్రబాబు సూచించారు. అనంతరం వేణు దత్తాత్రేయ స్వామి అభిషేకం పాదుక పూజలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

Tags:    

Similar News