Chandrababu Naidu: పారిశ్రామిక రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్

Chandrababu Naidu: ఏపీకి భారీగా పరిశ్రమలను తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు

Update: 2024-07-11 16:15 GMT

Chandrababu Naidu: పారిశ్రామిక రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్   

Chandrababu Naidu: పారిశ్రామిక రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏపీకి భారీగా పరిశ్రమలను తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా... ఏపీలో 75 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన బీపీసీఎల్ సిద్ధమైంది. బీపీసీఎల్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ స్థాపనపై వారితో చర్చలు జరిపారు. చంద్రబాబుతో చర్చల అనంతరం ఏపీలో రిఫైనరీ పరిశ్రమను స్థాపించేందుకు బీపీసీఎల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రిఫైనరీ పరిశ్రమ స్థాపన కోసం ప్రాంతాల పరిశీలన ప్రారంభించాలని కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు. త్వరలోనే పరిశ్రమ ఎక్కడ స్థాపిస్తారన్న దానిపై రానున్న క్లారిటీ రానుంది.

Tags:    

Similar News