Chandrababu Naidu: సీఎం హోదాలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబు

Chandrababu Naidu: కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా

Update: 2024-06-25 14:05 GMT

Chandrababu Naidu: సీఎం హోదాలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబు

Chandrababu Naidu: కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. వచ్చే ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. కుప్పంలో రౌడియిజం చేసే వారికి ఇదే చివరి రోజన్నారు. ఎన్నికల ప్రచారంలో హామి ఇచ్చిన మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్న ఆయన... పింఛన్లను సచివాలయ ఉద్యోగులతో ఇళ్ల వద్దనే అందిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు.

Tags:    

Similar News