AP News: కల్తీ నెయ్యి ఘటనపై స్పందించిన ఏపీ డీజీపీ

AP News: సుప్రీం ఆదేశాలతో సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేశాం

Update: 2024-10-01 10:24 GMT

AP News: కల్తీ నెయ్యి ఘటనపై స్పందించిన ఏపీ డీజీపీ

AP News: కల్తీ నెయ్యి ఘటనపై ఈనెల 3 వరకు సిట్ దర్యాప్తు నిలిపి వేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీం ఆదేశాల మేరకు దర్యాప్తు చేపడతామన్నారు. సుప్రీంలో విచారణ జరుగుతుండటంతో దర్యాప్తు నిలిపివేసినట్లు చెప్పారు. పోలీస్‌ శాఖ న్యాయస్థానం ఆదేశాల ప్రకారం పని చేస్తుందన్నారు. కౌన్సిల్ సూచనల మేరకు దర్యాప్తు తాత్కాలికంగా ఆపామన్నారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులశాఖ ఎవరినీ ఇబ్బంది పెట్టదని ద్వారకా తిరుమలరావు స్పష్టంచేశారు.

Tags:    

Similar News