Minister Gangula: బీసీలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ
Minister Gangula: చేతి వృత్తులకు చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసా కల్పించేందుకే బీసీలకు లక్ష సహాయం పథకం తీసుకొచ్చామన్నారు మంత్రి గంగుల.
Minister Gangula: చేతి వృత్తులకు చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసా కల్పించేందుకే బీసీలకు లక్ష సహాయం పథకం తీసుకొచ్చామన్నారు మంత్రి గంగుల. సచివాలయంలో మంత్రి గంగుల అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రులు హరీష్ రావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బీసీలకు లక్ష సహాయం పథకం నిరంతర ప్రక్రియ అని గంగుల తెలిపారు. ఇప్పటి వరకు..2 లక్షల 70 వేల దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయని వెల్లడించారు. ఇక ఇన్చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతీ నెల15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా సహాయాన్ని అందజేస్తామన్నారు మంత్రి గంగుల.