Revanth Reddy: తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం!
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు.
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. పలు నమూనాలను పరిశీలించిన సీఎం.. తుది నమూనాపై కీలక సూచనలు చేశారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు రూపొందే చిహ్నాన్నే.. జూన్ 2న ఆవిష్కరించనున్నారు. త్వరలో తుది చిహ్నం సిద్ధం కానుందని.. కాగా ఇప్పటికే రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణకు మెరుగులు దిద్దేందుకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆ పాటను అప్పగించారు.