Road Accident: మహబూబ్ నగర్ జిల్లాలో బస్సు దగ్ధం
Road Accident: డీసీఎంను ఢీకొన్న ధర్మవరం ఆర్టీసీ డిపో బస్సు
Road Accident: మహబూబ్ నగర్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు దగ్దం అయ్యింది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి దగ్గర డీసీఎం వాహనాన్ని డీకొట్టింది. దీంతో ఒక్క సారిగా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపి వేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ వాహనంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.