World Cup 2023: సెమీ ఫైనల్‌ రేసు నుంచి తప్పుకున్న పాక్, ఆఫ్గాన్.. టీమిండియాతో తలపడే జట్టు ఇదే..!

World Cup 2023: గురువారం జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 160 బంతుల్లో 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సెమీ-ఫైనల్ టిక్కెట్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది.

Update: 2023-11-10 05:54 GMT

World Cup 2023: సెమీ ఫైనల్‌ రేసు నుంచి తప్పుకున్నపాక్, ఆఫ్గాన్.. టీమిండియాతో తలపడే జట్టు ఇదే..!

World Cup 2023: గురువారం జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 160 బంతుల్లో 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సెమీ-ఫైనల్ టిక్కెట్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. శ్రీలంకపై న్యూజిలాండ్ సాధించిన ఈ భారీ విజయం తర్వాత, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌ని నవంబర్ 11న ఇంగ్లాండ్‌తో ఆడాల్సి ఉంది. 2023 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలంటే, ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ 287 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలవాలి. ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి పాక్‌పై ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. పాక్‌ 2.3 ఓవర్లలో దానిని సాధించాల్సి ఉంటుంది. అదే సమయంలో, 2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలంటే, దక్షిణాఫ్రికాను 438 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది.

ప్రపంచకప్ సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు..

మొత్తంమీద, 2023 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలనే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆశలు దాదాపుగా ముగిసిపోయాయనే చెప్పాలి. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడడం దాదాపు ఖాయం. 2023 ప్రపంచకప్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి సెమీఫైనల్ జరగనుంది. 2023 ప్రపంచకప్‌లో భారత్ 8 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లను కలిగి ఉంది. 2023 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. 2023 ప్రపంచకప్‌లో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ని నవంబర్ 12న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంది. నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్ భారత్‌కు లాంఛనమే. నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా, ఓడినా.. పాయింట్ల పట్టికలో రోహిత్ సేన అగ్రస్థానంలో కొనసాగుతుంది.

సెమీ ఫైనల్ లైనప్ దాదాపు సిద్ధం..

లీగ్ దశలో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా, న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. మొదటి సెమీ-ఫైనల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, నాల్గవ జట్టు అంటే న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో సెమీఫైనల్ ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. రెండో సెమీఫైనల్ నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. నవంబర్ 15న జరిగే తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ దాదాపు ఖాయమైంది.

Tags:    

Similar News