Nitish Kumar Reddy: విరాట్ కోహ్లీ షూలతో తనకున్న అనుబంధాన్ని చెప్పిన నితీష్ కుమార్ రెడ్డి

Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భారత క్రికెట్లో ఎదుగుతునున్న స్టార్ క్రికెటర్. తన తొలి ఆస్ట్రేలియా పర్యటనలో తను మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీ సాధించాడు. తన కొడుకు సెంచరీ చూసి నితీష్ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు.

Update: 2025-03-21 14:45 GMT
Nitish Kumar Reddy

Nitish Kumar Reddy: విరాట్ కోహ్లీ షూలతో తనకున్న అనుబంధాన్ని చెప్పిన నితీష్ కుమార్ రెడ్డి

  • whatsapp icon

Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భారత క్రికెట్లో ఎదుగుతునున్న స్టార్ క్రికెటర్. తన తొలి ఆస్ట్రేలియా పర్యటనలో తను మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీ సాధించాడు. తన కొడుకు సెంచరీ చూసి నితీష్ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. 114 పరుగుల ఆ ఇన్నింగ్స్ ఈ యువ క్రికెటర్ జీవితాంతం గుర్తుండిపోయే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ 'బూట్లు' కూడా ఈ సెంచరీకి దోహదపడ్డాయి. నితీష్ స్వయంగా MCG మైదానంలో విరాట్ బూట్లు వేసుకుని సెంచరీ చేశానని చెప్పాడు.

యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ నితీష్ రెడ్డి ఇలా వెల్లడించాడుజజ "ఒకసారి లాకర్ రూమ్‌లో విరాట్ కోహ్లీ సర్ఫరాజ్ ఖాన్‌ను మీ షూ సైజు ఎంత అని అడిగాడు? సర్ఫరాజ్ '9' అన్నాడు, అప్పుడు విరాట్ నా వైపు చూశాడు, నేను ఆలోచించడం మొదలుపెట్టాను, 'ఇది నిజంగా నాకు జరుగుతుందా?' ఆ బూట్లు నా సైజులో లేకపోయినా, నాకు అవి ఖచ్చితంగా కావాలి. నేను అతనికి నా సైజు చెప్పి '10' అని అన్నాను, అప్పుడు విరాట్ నాకు బూట్లు ఇచ్చాడు. నేను తరువాతి మ్యాచ్‌లో అదే బూట్లు ధరించి సెంచరీ చేశాను.

MCGలో సెంచరీ చేసిన తర్వాత జట్టు సభ్యులందరూ తనను అభినందించారని, కానీ తాను ఒకే ఒక్క వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని నితీష్ రెడ్డి అన్నారు. "విరాట్ భాయ్ నా దగ్గరకు వచ్చి నేను బాగా ఆడానని చెప్పినప్పుడు, ఆ క్షణం నాకు చాలా ప్రత్యేకమైనది" అని నితీష్ అన్నారు.

ప్రస్తుతం నితీష్ రెడ్డికి నొప్పి సమస్య ఉంది. దాని కారణంగా అతను ఐపీఎల్ 2025లో ఆడటంపై సందేహాలు తలెత్తుతున్నాయి. మంచి విషయం ఏమిటంటే BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐపీఎల్ 2025 లో ఆడటానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఐపీఎల్ 2025 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ.6 కోట్లకు దక్కించుకుంది.

Tags:    

Similar News