IPL 2025 New Rules: మారిన రూల్స్ ప్రకారం హార్దిక్ పాండ్యాపై నిషేధం ఎత్తేస్తారా ?

IPL 2025 New Rules: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డు స్లో ఓవర్ రేటు నియమాన్ని మార్చింది. అందుకు బాధ్యులైన కెప్టెన్లపై నిషేధాన్ని రద్దు చేసింది.

Update: 2025-03-21 13:31 GMT
IPL 2025 New Rules

IPL 2025 New Rules: మారిన రూల్స్ ప్రకారం హార్దిక్ పాండ్యాపై నిషేధం ఎత్తేస్తారా ?

  • whatsapp icon

IPL 2025 New Rules: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డు స్లో ఓవర్ రేటు నియమాన్ని మార్చింది. అందుకు బాధ్యులైన కెప్టెన్లపై నిషేధాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఏ కెప్టెన్‌పైనా స్లో ఓవర్ రేట్ కారణంగా నిషేధం పడదు. బీసీసీఐ ఈ నిర్ణయం తర్వాత హార్దిక్ పాండ్యాపై నిషేధం ఎత్తివేస్తారా అన్న ప్రశ్న ఆయన అభిమానుల్లో తలెత్తింది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో అతను పాల్గొంటాడా అన్నదానికి ప్రస్తుతానికి సమాచారం లేదు. నిబంధనలు మార్చినప్పటికి పాండ్యా ముంబైతో జరిగే ప్రారంభ మ్యాచ్ ఆడలేడు.

బీసీసీఐ స్లో ఓవర్ రేట్ నిబంధనను మార్చి కెప్టెన్లపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌లో ఆడటానికి అనుమతి లేదు. ఎందుకంటే భారత బోర్డు ఐపీఎల్ 2025 నుంచి మాత్రమే కొత్త నియమాన్ని అమలు చేసింది. దీని అర్థం కెప్టెన్లు ఈ సీజన్ నుంచి ఇకపై నిషేధించబడే ముప్పును ఎదుర్కోరు. అయితే గత సీజన్లో పాండ్యా మూడుసార్లు స్లో ఓవర్ రేట్‌కు దోషిగా తేలింది. కాబట్టి, అతను తన తప్పుకు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. దీని తర్వాతే అతను ఐపీఎల్‌లో పాల్గొంటాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు అనుగుణంగా స్లో ఓవర్ రేట్‌కు బీసీసీఐ ఇప్పుడు శిక్ష విధించింది. దీని అర్థం ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం కెప్టెన్ దోషిగా తేలితే జరిమానా విధిస్తారు. డీమెరిట్ పాయింట్లు కూడా యాడ్ చేస్తారు. నివేదిక ప్రకారం, ఒక జట్టు స్లో ఓవర్ రేట్ కేసును మరింత తీవ్రంగా పరిగణిస్తే, అది లెవల్-2 కిందకు వస్తుంది. నాలుగు డీమెరిట్ పాయింట్లు నేరుగా ఇస్తారు. ఒక కెప్టెన్ 4 డీమెరిట్ పాయింట్లు పొందిన వెంటనే మ్యాచ్ రిఫరీ కెప్టెన్ మ్యాచ్ ఫీజులో 100 శాతం తగ్గించవచ్చు లేదా అదనపు డీమెరిట్ పాయింట్లను ఇవ్వవచ్చు.

గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడుసార్లు స్లో ఓవర్ రేట్ అనే తప్పు చేసింది. దీని కారణంగా అంతకుముందు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా విధించారు.గత మ్యాచ్‌లో ఈ తప్పును పునరావృతం చేసినందుకు పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. కొత్త సీజన్‌లో అతను ఆ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అతనితో పాటు గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ కూడా ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.

Tags:    

Similar News