కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామాగా వంచన.. నవంబర్ 8న రిలీజ్‌కు రెడీ

చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఉమా మహేష్ ప్రధాన పాత్రలో "వంచన" సినిమా రానుంది.

Update: 2024-10-25 06:15 GMT

కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామాగా వంచన.. నవంబర్ 8న రిలీజ్‌కు రెడీ

చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఉమా మహేష్ ప్రధాన పాత్రలో "వంచన" సినిమా రానుంది. ఈ సినిమాకు ఉమా మహేష్ మార్పు దర్శకత్వం వహిస్తుండగా, గౌరీ మార్పు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను సోషల్ మీడియా‌లో విడుదల చేశారు. ఈ చిత్రం నవంబర్ 8 న విడుదల కానున్నట్లు నిర్మాత తెలిపారు. ఇందులో సూర్య, రాజేంద్ర, ఆర్‌కె నాయుడు, సోనీ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఉమా మహేష్ మార్పు మాట్లాడుతూ "వంచన ఒక కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామా చిత్రం. అరకు ఊరిలో ఒక క్రిస్టియన్ ఫాదర్‌ని అతి కిరాతకంగా హత్య చేస్తారు. మంచి స్క్రీన్ ప్లే తో అద్భుతమైన ట్విస్టులతో హత్య ఎవరు, ఎందుకు చేస్తారో తెలిపే కోర్టు రూమ్ డ్రామా కథే మా 'వంచన' సినిమా. మా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని చూసి సున్నితమైన కథని చాలా గొప్పగా చిత్రీకరించారు అంటూ అభినందించారని ఆయన తెలిపారు.

'ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 2 న విడుదల చేస్తున్నాం.  సినిమా చాలా కొత్తగా, మంచి థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుంది. అరకు, ఢిల్లీ, మనాలి, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం, జైపూర్ లాంటి  అందమైన లొకేషన్స్‌లో మా చిత్రాన్ని రెడ్ డ్రాగన్ సినీ లైన్ కెమెరా తో చిత్రీకరించాం. మా సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. నవంబర్ 8న విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాం" అంటూ ఆయన ప్రకటించారు.

Tags:    

Similar News