రాంగోపాల్‌ వర్మ పిచ్చి వదిలిస్తాం..

Update: 2018-01-19 11:47 GMT

ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్‌ వర్మపై బీజేపీ మహిళా మోర్చ నేతలు విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జీఎస్‌టీ వెబ్‌ సిరీస్‌ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నాడంటూ మండిపడ్డారు. వర్మకు పిచ్చి పట్టడం వల్లే ఇటువంటి అర్థంపర్థం లేని పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. అందుకే ఆయనను భార్యతో పాటు కూతురు కూడా వెలి వేశారని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాంగోపాల్‌ వర్మ పిచ్చి వదిలిస్తామని బీజేపీ మహిళా మోర్చ నేతలు హెచ్చరించారు.

Similar News