ఎమ్మెల్యే రోజాపై అసభ్యకర పోస్టింగ్‌లు..ఏపీ డీజీపీకి ఫిర్యాదు

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాళ్ళ బృందం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ రవిశంకర్‌ను కలిశారు.

Update: 2019-12-20 03:47 GMT

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాళ్ళ బృందం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ రవిశంకర్‌ ను కలిశారు. ఈ సందర్బంగా ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి శాసనసభ్యురాలు ఆర్‌కే.రోజా తోపాటు ఇతర మహిళా నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు డీజీపీ రవిశంకర్‌ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన అదనపు డీజీపీ నిందితులు ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..

ప్రజా జీవితంలో ఉన్న మహిళా నేతలపై అభ్యంతరకరమైన దూషణలతో కూడిన పోస్టింగ్‌లు పెట్టడం అవమానకరమని.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఇంకా పెచ్చుమీరే ప్రమాదం ఉందని అన్నారు. కేవలం వైసీపీ వాళ్లపైనే కాకుండా ఏ పార్టీ మహిళా నేతలైనా? అసభ్యకరమైన పోస్టులు పెట్టినా చర్యలు తీసుకోవాలని వైసీపీ మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. ఏపీ మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్ పెదపాటి అమ్మాజీ ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల మహిళా విభాగం సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, జమ్మలమడక నాగమణి, బొట్టా కనకదుర్గ ,సుధారాణి, హిమబిందు, అనిత, శ్రీలక్ష్మీ, విజయలక్ష్మి తదితర వైసీపీ మహిళా విభాగం నేతలు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. 

Tags:    

Similar News