అనంతపురం జిల్లాలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. టీడీపీ నేత ఇంటి చుట్టూ రాళ్లు పాతిన వైసీపీ నేత..

Update: 2019-10-27 10:58 GMT

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ నేత నాగరాజు, వైసీపీ నేత వెంకటనారాయణరెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది. నాగరాజు ఇంటి చుట్టూ వెంకటనారాయణరెడ్డి బండలు పాతడం కలకలం రేపింది. వెంకటాపురంలో నాగరాజు నివాసం ఉంటారు. స్థల వివాదం నేపథ్యంలో నాగరాజు ఇంటికి అడ్డుగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బండలు పాతించారు. దీంతో బయటి నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

దీనిపై పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు, టీడీపీ నేత స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆ గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News