Vidadala Rajini: డయేరియాతో బాధపడుతున్నవారిని ప్రభుత్వమే గుర్తించి.. ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నాం

Vidadala Rajini: వాంతులు విరోచనాలతో బాధపడుతున్న వారికి.. గుంటూరు జీజీహెచ్‌లో మెరుగైన వైద్యం అందిస్తున్నాం

Update: 2024-02-12 10:09 GMT

Vidadala Rajini: డయేరియాతో బాధపడుతున్నవారిని ప్రభుత్వమే గుర్తించి.. ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నాం

Vidadala Rajini: డయేరియాపై మంత్రి విడదల రజినీ అధికారులతో సమీక్షించారు. గత మూడు రోజులుగా వాంతులు విరోచనాలతో బాధపడుతున్న వారికి గుంటూరు జీజీహెచ్‌లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి విడుదల రజినీ తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామన్నారు. డయేరియాతో బాధపడుతున్నవారిని ప్రభుత్వమే గుర్తించి..ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత రోగ లక్షణాలకు కారణం ఏంటో తెలుస్తుందని మంత్రి విడదల రజినీ తెలిపారు.

Tags:    

Similar News