Penamaluru: సచివాలయ ఉద్యోగులపై ఎమ్మెల్సీ ఆగ్రహం

సచివాలయ ఉద్యోగులు కార్యదర్శికి మద్దతుగా, చైర్మెన్ కి వ్యతిరేకంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవటంపై ఎమ్మెల్సీ వైవిబీ రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2020-02-20 10:30 GMT

పెనమలూరు: సచివాలయ ఉద్యోగులు కార్యదర్శికి మద్దతుగా, చైర్మెన్ కి వ్యతిరేకంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవటంపై ఎమ్మెల్సీ వైవిబీ రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉయ్యూరులో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రిపై అభిమానం ఉంటే ఆయన నివాసం వద్దకు వెళ్లి చెక్క భజన చెయ్యండి సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు, ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారు. వాటిని గుర్తించండి శపరిధి దాటి వ్యవహరిస్తే, సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని అన్నారు.

Tags:    

Similar News