గన్నవరంలో పొలిటికల్ హీట్ .. వంశీ వద్దు .. యార్లగడ్డ ముద్దు అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు

Update: 2019-10-26 08:53 GMT

కృష్ణా జిల్లా పొలిటికల్ సర్కిల్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్ అగ్గి రాజేసింది. సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటి కావడంపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నివాసం ఎదుట ఆందోళనకు దిగాయి. వల్లభనేని వద్దు - యార్లగడ్డ ముద్దు అంటూ నినాదాలు చేశారు. అయితే వంశీ ఎపిసోడ్‌పై ఇప్పటికిప్పుడు తాను స్పందించలేనని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, నకిలీ పట్టాల వల్లే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో తాను ఓడిపోయానని యార్లగడ్డ అన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని వంశీ పార్టీలో చేరే అంశంపై జగన్ ను కలిసిన తరువాతే స్పందిస్తానన్నారు.    

Tags:    

Similar News