కామాంధులను నడిరోడ్డులో ఉరి తీయాలి : పవన్ కళ్యాణ్

Update: 2019-12-02 11:03 GMT
పవన్ కళ్యాణ్

రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. శంషాబాద్ దిశ ఘటన గురించి మాట్లాడుతూ, ఆడపిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చేంతవరకు ఓ అన్నగా, ఓ తమ్ముడిగా గుండెలు ఎలా కొట్టుకుంటాయో తనకు తెలుసని, తాను ఆడపిల్లల మధ్య పెరిగినవాడ్నేనని అన్నారు. దిశకు తక్షణం న్యాయం జరగాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నిందితులను తోలు ఉడే వరకు కొట్టాలని, నడిరోడ్డులో ఉరి తీయాలని చెప్పారు. సింగపూర్ తరహాలో కామాంధులకు శిక్ష విధించాలని పవన్ చెప్పారు.

Full View 

Tags:    

Similar News