పవన్ కు నేరస్తుల ప్రాణాలు ముఖ్యమైపోయాయా? : ఎంపీ విజయసాయిరెడ్డి

నేరస్తులను బెత్తంతో కొట్టాలని పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Update: 2019-12-04 06:50 GMT
విజయసాయిరెడ్డి, పవన్ కళ్యాణ్

నేరస్తులను బెత్తంతో కొట్టాలని పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నేరస్తులను సీరియస్ గా శిక్షించకుండా బెత్తంతో శిక్షించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో..

నేరస్తులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే ఈయనకు నేరస్తుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి. 

పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా?' అంటూ విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు ఒకాయనేమో 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఇంకొకాయన అజ్ణానాంధకారాన్ని కవర్ చేసుకునేందుకు రాజ్యాంగాన్ని ఔపోసన పట్టానంటాడు. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇంత నీచత్వానికి పాల్పడాలా అని ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారి పోయారిద్దరూ. అంటూ చంద్రబాబు పవన్ లను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు.





Tags:    

Similar News